రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ములుగు ఏఎస్పి సాయి చైతన్య ఆదేశాల మేరకు ఎస్సై హరికృష్ణ ఆధ్వర్యంలో ములుగు జాతీయ రహదారి వెంబడి ముళ్ళ పొదలు తొలగించారు. పలుచోట్ల ప్రమాద సూచికలు ప్రయాణికులకు కనిపించే విధంగా ఏర్పాటు చేశారు. వాహనదారులు రోడ్డు భద్రతా నిబంధనలు పాటించి వాహనాలు నడిపించాలని ఎస్ఐ పలువురికి అవగాహన కల్పించారు.
అదే విధంగా ద్విచక్ర వాహనాలపై వెళ్లేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రమాదాల నివారణకు సహకరించాలని కోరారు. జాతీయ రహదారి వెంట ఎక్కడైనా ప్రమాదకర పరిస్థితులు ఉంటే పోలీసుల దృష్టికి తీసుకురావాలని వారు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ములుగు ఎస్సై హరికృష్ణతో పాటు జాకారం సర్పంచి రమేష్ తదితరులు ఉన్నారు.