నిరుపేదలకు మరింత ఆరోగ్యాన్ని చేరువ చేయడంలో భాగంగానే సీఎం కేసీఆర్ అహర్నిశలు చేస్తున్నారని మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. అందులో భాగంగా శుక్రవారంనాడు బాలపూర్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి తన సొంత నిధులతో ఏర్పాటు చేసిన 108 వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు.
అనంతరం సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. పేదలకు కార్పొరేట్ వైద్యాన్నిఅందించాలన్న ఉద్దేశ్యంతోనే సీఎం చూపిన బాటలో తాము నడుస్తున్నామన్నారు. ఇప్పటికే అనేక చోట్ల బస్తీదవాఖాల ఏర్పాటు, డయాలసీస్ సేవలు, నిరుపేదలకు ఖరీదైన వైద్యం అందజేయడంలో అనేక చర్యలు రాష్ర్ట ప్రభుత్వం తీసుకున్నదని స్పష్టం చేశారు. ఇక సీఎం సహాయనిధి నుంచి కూడా వైద్య చికిత్సకు అయ్యే ఖర్చును భరిస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం నిరుపేదల పాలిట నిజమైన ప్రేమ ఉన్న పార్టీ అని అందులో కేసీఆర్ వైఖరి స్పష్టంగా ఉందని నిరుపేదల, తెలంగాణ రాష్ర్ట ప్రజల మేలు కోసమే అహర్నిశలు కేసీఆర్ బాటలో మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు పని చేస్తున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు.
బాలాపూర్ మండలం లోని నిరుపేదలకు సరైన వైద్యం అందాలన్న ఉద్దేశ్యంతో, వారికి నిరంతరం అందుబాటులో ఉండేందుకే తన సొంత నిధులతో 108 వాహనాన్ని అందించానని మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మీర్ పేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దుర్గా దీప్లాల్ చౌహాన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, యూపీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ ఉమాదేవి, భారత గ్రామ నవ నిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ రమాజ్యోతి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సూపర్వైజర్ గోవింద రెడ్డి, డాక్టర్ బాలాజీ, డాక్టర్ బర్కతుల్లా, కార్పొరేటర్లు మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సుమన్ రావు, మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సిద్దాల లావణ్య బీరప్ప, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, మహిళా నాయకులు,108 కోఆర్డినేటర్లు, ఆశా వర్కర్లు, మారి స్వచ్ఛంద సంస్థ కో ఆర్డినేటర్లు వెంకన్న, మహేశ్వరం నియోజకవర్గం సోషల్ మీడియా కన్వీనర్ సిలువేరి సాంబశివ తదితరులు పాల్గొన్నారు.