ఈ ఏడాది ప్రారంభంలో 15 ఏళ్ల బాలికపై తొమ్మిది రోజుల పాటు పదే పదే అత్యాచారం చేసిన 13 మందికి కోటా కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించగా, మరో ఇద్దరికి నాలుగేళ్ల పాటు జైలు శిక్ష విధించింది. రాజస్థాన్లోని కోటా కోర్టు ఈ కీలక తీర్పు ఇచ్చింది.
అలాగే ఆ చిన్నారిని ఝలావర్కు తీసుకెళ్లి అక్కడ అత్యాచారం చేయించినందుకు ఒక మహిళకు నాలుగేళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు. 20 ఏళ్ల శిక్ష విధించిన వారికి రూ.10 వేల జరిమానా కూడా విధించగా, నాలుగేళ్లు శిక్ష పడిన వారికి రూ.7వేల జరిమానా విధించారు.