భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలములో ఇసుక, మట్టి అక్రమ రవాణ జరుగుతుందనే సమాచారంతో రెవెన్యూ, పోలీసులు సంయుక్తంగా దాడులు జరిపి మొత్తము 23 లారీలు, 17 ట్రాక్టర్లు 3 JCB లు పట్టుకొని మొత్తము 12,65,000/- జరిమానా విధించినట్లు పాల్వంచ తహసీల్దార్ రంగ ప్రసాద్ తెలిపారు. వసూలు చేసిన జరిమానా ప్రభుత్వానికి చలాన రూపములో కట్టినట్లు ఆయన చెప్పారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇసుక, మట్టి అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆయాన్క్ హెచ్చరించారు. అనుమతులు లేకుండా రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు వాహనాలు సీజ్ చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
previous post