2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను సింగరేణి సంస్థ లాభాల్లో 32% బోనస్గా కార్మికులకు అందించాలని సీఎం కెసిఆర్ నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి లాభాల్లో కార్మికులకు అందించే వాటాను ప్రతి ఏడాది పెంచుతూ, బొగ్గు గని కార్మికులకు దేశంలోనే అత్యధికంగా దసరా కానుక అందిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. సీఎం కెసిఆర్ నిర్ణయం మేరకు ఉత్తర్వులు వెలువడనున్నాయి.
previous post