కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని సర్పవరం పంచాయతీలో మూడు కోట్ల పంచాయతీ నిధులు గల్లంతు అయ్యాయి. సంబంధిత వివరాలు కూడా ఇవ్వకుండా తప్పించుకుతిరుతున్న అధికారుల తీరుకు నిరసనగా జనసేన పార్టీ నాయకులు పుల్ల శ్రీరాములు ఆధ్వర్యంలో గ్రామస్తులు నేడు ఆందోళన చేశారు. సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం ఇవ్వాలని కోరిన స్థానికులకు పంచాయతీ వారు సమాధానం ఇవ్వలేదు.
2009 నుండి 2022 వరకు పంచాయతీ రికార్డుల సమాచారం కోసం ఆర్ టి ఐ యాక్ట్ ప్రకారం జనసేన నాయకులు వివరాలు కోరారు. పంచాయతీ కార్యదర్శి సమాచారం ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. కార్యదర్శికి వ్యతిరేకంగా రోడ్ పై ఆందోళన చేపట్టడంతో భారీగా ట్రాఫిక్ స్ధంభించింది.