విశాఖపట్నంలోని గాజువాకలో కిడ్నాప్ కలకలం రేగింది. నాలుగేళ్ల బాబును ఒక ముఠా కిడ్నాప్ చేసింది. అయితే పోలీసులు సరైన సమయంలో స్పందించడంతో కథ సుఖాంతం అయింది.
రాజస్థాన్ నుంచి వచ్చి గాజువాక ఆటో నగర్ లో నరేష్ యాదవ్ పరిశ్రమ నడుపుతున్నాడు. ఒకరి దగ్గర అప్పు తీసుకుని దాన్ని చెల్లించకపోవడంతో అతని కొడుకును వారు అపహరించారు.
మొత్తం రూ.40 లక్షలు అప్పు తిరిగి చెల్లించకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. దాంతో నరేష్ యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
గాజువాక పోలీసులు గంటల వ్యవధిలోనే కిడ్నాప్ ను ఛేదించారు. ఈ సంఘటనకు సంబంధించి ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.