ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC 2022) 6వ ఎడిషన్ కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ 5G సేవను ప్రారంభించారు. IMC 2022 అక్టోబర్ 4 వరకు కొనసాగనుంది. IMC 2022ని దాని అధికారిక యాప్ నుండి ప్రత్యక్షంగా చూడవచ్చు. ఈ ప్రోగ్రామ్లో 5G నెట్వర్క్ వినియోగం గురించి సమాచారం పొందవచ్చు. IMC మొదట 2017లో ప్రారంభించారు.
కరోనా కారణంగా గత రెండు సంవత్సరాలుగా IMC వర్చువల్గా నిర్వహిస్తున్నారు. ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC 2022)లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ వచ్చారు. అక్కడ ఆయనకు 5G సేవల గురించి సాంకేతిక నిపుణులు వివరించారు. అనంతరం ప్రధాని మోదీ 5జీ సేవలను ప్రారంభించారు. న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్లో జరిగిన ఈ కార్యక్రమం గురించి దేశం మొత్తం ఆసక్తిగా గమనిస్తున్నది. దేశ ప్రజలు చాలా కాలంగా 5G సేవల కోసం ఎదురు చూస్తున్నారు.
5G సాంకేతికత అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎలాంటి అవాంతరాలు లేని ఇంటర్నెట్ సేవలు అందుతాయి. అంతే కాకుండా అధిక డేటా రేట్లు కూడా గణనీయంగా తగ్గిపోతాయి. అత్యంత విశ్వసనీయమైన కమ్యూనికేషన్ ఫీచర్లను 5G అనుమతిస్తుంది. ఇది శక్తి సామర్థ్యం, స్పెక్ట్రమ్ సామర్థ్యం మరియు నెట్వర్క్ సామర్థ్యాన్ని కూడా గణనీయంగా మెరుగుపరుస్తుంది.