ముద్దొచ్చే ఈ పసిపాప ఇక లేదు. చదవడానికి ఎంతో కష్టంగా ఉన్నా ఇది నిజం. కేవలం ఐదు సంవత్సరాల వయసులోనే నూరేళ్లూ నిండిన ఈ పాప పేరు హనీ. కడప జిల్లా రాజంపేట రూరల్ మన్నూరు ఎస్సై గా పనిచేస్తున్న హనుమంతు కుమార్తె ఈ పాప. చక్కగా ఆడుతూ పాడుతూ తిరిగే హనీ ని డెంగ్యూ కబళించింది. తిరుపతి లో చికిత్స పొందుతూ హనీ మరణించింది. తిరుపతి నుంచి హనీ భౌతిక కాయాన్ని రాజంపేట లో తల్లిదండ్రి ఉంటున్నఇంటికి తీసుకువచ్చారు. అక్కడ నుంచి తండ్రి స్వగ్రామం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు కు తరలించారు. ఆడుతూ పాడుతూ తిరిగిన చిన్నారి డెంగ్యూ మహమ్మారి కి బలికావడం తో కుటుంబ సభ్యులు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
previous post