భారత దేశంలో వివిధ రాష్ట్రాలలో ప్రస్తుతం పనిచేస్తున్న గవర్నర్ లలో తానే యంగ్ అని తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ అన్నారు.అపోలో ఫోరెన్సిక్ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో పనిచేస్తున్న గవర్నర్ లలో నేనే యంగ్ గవర్నర్నని అంటూ సరదాగా మాట్లాడుతూ సభికులను నవ్వించారు. ఈ సదస్సుకు రావడం ఆనందంగా ఉందన్నారు. ఫోరెన్సిక్ ఆధారాలు న్యాయవ్యవస్థలో కీలకమని తమిళిసై చెప్పారు. హైదరాబాద్లో అన్ని రకాల వంటలు, సంస్కృతులు ఉండటం చాలా గర్వంగా ఉందని, అలాగే హైదరాబాద్ బిర్యానీకి తానూ బాగా అలవాటు పడ్డానని తమిళసై సౌందరరాజన్ తెలిపారు.
previous post
next post