దాదాపు రెండేళ్ల తర్వాత విజయనగరం లో పైడితల్లి సిరిమానోత్సవం జరుగుతోందని ఈ క్రమంలో భక్తులకు ఏ విధమైన ఆటంకం లేకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసామని జిల్లా పోలీసు బాస్ ఎస్పీ దీపికా అన్నారు. పైడితల్లి అమ్మవారి దర్శనం చేసుకున్నఅనంతరం ఆమెఎ విలేకరులతో మాట్లాడుతూ ఈ సారి భక్తుల సౌకర్యార్ధం…బారికేడ్లు ఏర్పాటు అంచలంచెలుగా ఇచ్చామన్నారు.
ఉదయం ఆరు నుంచీ రాత్రి వరకు పుల్ గా బందోబస్తు ఏర్పాటు చేసామన్నారు.ఉత్సవం సెంటిమెంట్ తో కఃడుకున్పదని…ఆ రకంగానే తమ సిబ్బంది మొత్తం చూస్తోందని ఓ ప్రశకు మేడం సమాధానమిచ్చారు. అనంతరంం పైడితల్లి అమ్మవారి దేవాలయం ఎదురుగా కమాండ్ కంట్రోల్ లో ఏర్పాటు చేసిన సిసి కెమెరాలను పరిశీలించారు… బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షించి, అధికారులకు, సిబ్బందికి పలు భద్రతాపరమైన సూచనలు చేశారు.
అలాగే కోట జంక్షన్ వద్ద, గంట స్థంభం పోలీసుశాఖ ప్రత్యేకంగా “సహాయ కేంద్రాలు” ను ఏర్పాటు చేసి, శ్రీ పైడితల్లి అమ్మవారి పండగకు విచ్చేసే ప్రజలకు దిశా యాప్ ప్రాముఖ్యతను వివరించి, ప్రతీ మహిళ తమ భద్రతకు తప్పనిసరిగా తమ మొబైల్స్ లో యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని మహిళా సంరక్షణ పోలీసులు కోరారు.