28.7 C
Hyderabad
May 5, 2024 23: 45 PM
Slider గుంటూరు

రైతును బెదిరించిన వినుకొండ ఎమ్మెల్యేపై చర్య తీసుకోండి

#navataramparty

రైతులకు అండగా ఉంటామని మాట్లాడాల్సిన ప్రజాప్రతినిధులు వారిని బెదిరిస్తూ వేధిస్తున్నారని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం ఆరోపించారు. గుంటూరు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు నరేంద్ర అనే రైతును ను చెప్పుతో కొడతా అని బెదిరించడం, తప్పుడు కేసులు పెట్టి జైలులో పెట్టించడం సరికాదని అన్నారు. చిలకలూరిపేట నవతరం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో రావుసుబ్రహ్మణ్యం మాట్లాడారు. వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పై చర్యలు తీసుకోవాలని, రైతు నరేంద్ర పై కేసుని ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు గతంలో జర్నలిస్ట్ పైన కూడా బెదిరింపులకు పాల్పడ్డారని ఆయన అన్నారు. బొల్లా బ్రహ్మనాయుడు పై ముఖ్యమంత్రి, స్పీకర్, గవర్నర్ చర్యలు తీసుకోవాలని కోరారు.

Related posts

దేశ వ్యాప్తంగా శ్రీకృష్ణాష్ఠమి వేడుకలు…!

Satyam NEWS

రిషి సునాక్ లాంటి వారిని మనమైతే ఎమ్మెల్యేగానైనా గెలిపిస్తామా?

Satyam NEWS

సీతానగరం అత్యాచార నిందితులు వైసీపీ వారే

Satyam NEWS

Leave a Comment