40.2 C
Hyderabad
April 26, 2024 13: 05 PM
Slider ప్రత్యేకం

మే 27 న హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో యోగా కార్యక్రమం

#kishanreddy

యోగా అనేది ఏ మతానికో .. సంస్కృతికో సంబంధించినది కాదని, ప్రతి మనిషి మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పెంచేందుకు యోగా ఒక సాధనమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లో మే 27న 25 రోజుల కౌంట్ డౌన్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు కిషన్ రెడ్డి. ఇందులో ప్రతీ ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు. “ఏదైనా పనిని ఎంతో ఉత్సాహంతో ప్రారంభించడం.. కొనసాగించడం అనేది చాలా ముఖ్యం.

అనేక వేల సంవత్సరాల క్రితం నుంచి మన దేశ ప్రజల జీవనంలో యోగా భాగమైంది. దానిని మోడీ ప్రధాని అయిన తర్వాత ప్రపంచానికి పరిచయం చేశారు. అలాగే ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ప్రతీ ఏడాది కూడా జూన్ 21 తేదీ ప్రపంచ యోగా దినోత్సవంగా ప్రకటించారు. ఐక్యరాజ్య సమితి తీర్మానం మేరుకు అనేక దేశాలు అధికారికంగా యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయి.

అనేక కంపెనీల్లో యోగా కోసం ప్రత్యేక ఫ్లోర్స్ కేటాయిస్తున్నారు. ప్రతీ రోజు అక్కడ యోగా చేయడం మనకు గర్వకారణం. మనదేశంలోని అనేక పార్కులు, సంస్థలు, కాలనీల్లో యోగా శిక్షణ కేంద్రాలు నడుపుతున్నారు. దీని ద్వారా మన మేధస్సు పెరుగుతుంది. ఎవరైనా సరే తమ వృత్తుల్లో మెరుగైన ఫలితాలు రాబట్టడానికి యోగ ఉపయోగపడుతుంది.  ఏడాది కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని దేశ వ్యాప్తంగా,  ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించాలని ఐక్యరాజ్య సమితి, భారత ప్రభుత్వం సంయుక్తంగా అనేక చర్యలు తీసుకుంటున్నాయి.

అంతర్జాతీయ యోగా ఉత్సవాన్ని మన దేశంలో ఆజాద్ కా అమృత్ మహోత్సవం సెకెండ్ ఫేజ్ లో భాగంగా యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాం. మన దేశంలోని ప్రతీ గ్రామంలో .. ప్రతి ఇంట్లో కుటుంబ సభ్యులు జూన్ 21వ తేదీన యోగా కార్యక్రమాన్ని జరుపుకోవడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇది ఎవరి కోసమో కాదు.. ప్రతీ ఒక్కరి కుటుంబానికి మంచి బాట వేయడానికి ఉపయోగపడుతుంది.

తూర్పున ఉన్న ఫిజీ నుంచి పశ్చిమాన ఉన్న సాన్ ఫ్రాన్సిస్కో వరకు అన్ని దేశాల్లో యోగాలో పాల్గోవాలని కోరుకుంటున్నారు. అందుకే జూన్ 21 కి వంద రోజుల ముందు నుంచే అందరిని సిద్ధం చేస్తున్నాం. అన్ని సంస్థలతో కలిసి 100 రోజుల కౌంట్ డౌన్ ఢిల్లీలో ప్రారంభించాం. 75 రోజుల కౌంట్ డౌన్ అస్సాం లో.. 50 రోజుల కౌంట్ డౌన్ రాజస్థాన్ జైపూర్ లో జరిగింది. 25 రోజుల కౌంట్ డౌన్ కార్యక్రమం మే 27న నిర్వహించాలని నిర్ణయించాము. పెరేడ్ గ్రౌండ్స్ లో 25 రోజుల కౌంట్ డౌన్ కార్యక్రమం జరుగుతుంది.

ప్రపంచానికి జూన్ 21న యోగా దినోత్సవం అద్భుతంగా నిర్వహించాలనే సందేశం పంపడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మే 27వ తేదీ ఉదయం 5 గంటలకు పెరేడ్ గ్రౌండ్ లో జరిగే యోగా కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యం కావాలి.  ఈ అవకాశం హైదరాబాద్ కు రావడం ఎంతో సంతోషం. 25 రోజుల కౌంట్ డౌన్ కార్యక్రమం హైదరాబాద్ లో పెట్టాలని మోడీ తెలిపారు. ప్రధాని ఆకాంక్షకు అనుగుణంగా హైదరాబాద్ లో ఉన్న యోగా సంస్థలు.. వాళ్లందరూ స్వస్ఛందంగా ముందుకు వచ్చి మే 27వ తేదీ కార్యక్రమం విజయవంతం చేయాలని పనిచేస్తున్నారు.

యోగ ఒక మతం, ఒక కల్చర్ కు సంబంధించి అని కొందరు అంటున్నారు. అయితే ఇస్లాం, క్రిస్టియన్ దేశాల్లో యోగా పాటిస్తున్నారు. యోగా ఏ మతానికో సంబంధించి కాదు.. వ్యక్తి మానసిక పరివర్తకు ఇది ఉపయోగపడుతుంది. యోగా చేస్తే డాక్టర్లు, ఆసుపత్రుల అవసరం ఉండదు. యోగా చేస్తే మీకు మీరే డాక్టర్. ” అని అన్నారు కిషన్ రెడ్డి. “గతంలో ఆయుష్ డిపార్ట్ మెంట్ కు ప్రత్యేక శాఖ ఉండేది కాదు. అయితే ప్రధాని మోడీ ఆయుష్ కు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయించారు. కరోనా సమయంలో ఈ యోగా, ఆయుర్వేదం మంచి ఫలితాలు ఇచ్చాయి. దీని కోసమే ఆయుష్  డిపార్ట్ మెంట్ ఏర్పాటు చేసి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అనేక దేశాలకు యోగా గురువులను ఆయుష్ డిపార్ట్ పంపింది. ఆయా దేశాల్లో శిక్షకులను తయారు చేస్తోంది. ఆయుష్ మంత్రి సర్వానందం సోనోవాల్  కార్యక్రమంలో పాల్గొంటారు. ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ మినిస్టర్ అనురాగ్ ఠాకూర్, కార్మిక శాఖ మంత్రి ఉపేంద్ర యాదవ్ గారు, ఆయుష్ సహాయ మంత్రి మహేంద్రబాయ్ కూడా పాల్గొంటారు.

యోగా ద్వారా ఇచ్చి మెసేజ్ ప్రతీ ఇంటికి చేరాలి. ఆయుష్ రిపార్ట మెంట్ ద్వారా సినీ నటులు, క్రీడాకారులను ఆహ్వానిస్తున్నాం. ఆహ్వానం అందినా అందకపోయినా అందరూ రావాలి. రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు, ప్రజాప్రతినిధులు కూడా రావాలని కోరుతున్నాం. రాష్ట్ర గవర్నర్ , ముఖ్యమంత్రిని కూడా రావాలని కోరుతున్నాం. యోగా టీ షర్ట్ కూడా అందిస్తాం. అన్ని రకాల ఏర్పాట్లు పెరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేస్తాం. వివిధ దేశాల్లోని ప్రధానులు యోగా చేస్తున్నారు. భారతదేశంలో ప్రతీ పార్కులో యోగా చేస్తూ కనిపిస్తున్నారు. మన దేశం నుంచి ఇతర దేశాలకు వెళ్లి యోగాలో శిక్షణ ఇస్తున్నారు. భారతలోని గురువులకు ఎంతో మంది ఫాలోవర్స్ ఉన్నారు. దీనికి కారణం యోగా. యోగా డే రోజు క్లోటాది మంది పాల్గొంటారు. ఇది గర్వపడాల్సిన అంశం. ”  అని అన్నారు కిషన్ రెడ్డి.

Related posts

జాన్ సహస్ కార్యాలయాన్ని ప్రారంభించిన డిఎస్పీ

Satyam NEWS

ధర్నాల పేరుతో ఢిల్లీలో సీఎం కేసీఆర్ హైడ్రామా

Satyam NEWS

ప్రజల ప్రాణాల కంటే కెసిఆర్ కు ఎన్నికలే ముఖ్యం

Satyam NEWS

Leave a Comment