29.7 C
Hyderabad
May 4, 2024 06: 52 AM
Slider నల్గొండ

మిర్యాలగూడ లో ఘనంగా హరితహారం కార్యక్రమం

#Meryalaguda MLA

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 6వ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా బుధవారం రోజు నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావుతో కలసి శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మొక్కలు నాటారు.

దామరచర్ల మండలంలోని దామరచర్ల, బొత్తలపాలెం,వాడపల్లి, తాళ్ళవీర్పగూడెం లో మొక్కలు నాటి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. సిసి రోడ్లు, డ్రైనేజీలు, గ్రామపంచాయతీ అదనపు  గది నిర్మాణం, అంగన్ వాడి భవన ప్రహరీ గోడ నిర్మాణం లకు శంకుస్థాపన, ప్రారంభోత్సవలు చేశారు.

తాళ్లవీరప్ప గూడెం గ్రామంలో నూతనంగా నిర్మించిన తేజస్విని ఫిల్లింగ్ స్టేషన్ పెట్రోల్ బంక్ ను ప్రారంభించిన అనంతరం దామరచర్ల మండల ప్రజాపరిషత్ ఆవరణలో క్లస్టర్ రైతు వేదిక భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో రైతుల ను ఉద్దేశించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం చేపడుతున్న విషయాల గురించి వివరించి చెప్పారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు E.రాంచంద్ర నాయక్, DCMS జిల్లా వైస్ ఛైర్మన్ దుర్గంపూడి నారాయణ రెడ్డి,మార్కెట్ ఛైర్మన్ చింతరెడ్డి శ్రీనివాస రెడ్డి స్థానిక జడ్పీటీసీ, మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు, మార్కెట్ వైస్ ఛైర్మన్ మెగ్యా నాయక్, ఆర్డీఓ రోహిత్ సింగ్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, డివిజన్ వ్యవసాయ అధికారి పోరెడ్డి నాగమణి, ఎంపీడీఓ, మండల సర్పంచ్ లు,ఎంపీటీసీ లు,స్థానిక నాయకులు హాజరయ్యారు.

Related posts

గుంటూరు జిల్లాలో లాక్ డౌన్ ఆంక్షలు మరింత కఠినం

Satyam NEWS

ఫిబ్రవరి 1న శ్రీ కాళహస్తీశ్వర స్వామివారికి తై అమావాస్య అభిషేకం

Satyam NEWS

జిల్లా సంక్షేమ అధికారిగా  స్వర్ణలత లేనీనా

Murali Krishna

Leave a Comment