“తై అమావాస్య” సందర్భంగా శ్రీకాళహస్తి లోని శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం లో విశేష అభిషేకం నిర్వహిస్తారు. ప్రధాన ఆలయం నుండి శ్రీ స్వామి అమ్మవార్లను భరద్వాజ తీర్థము (లోబావి) లోని శివాలయానికి తీసుకువెళ్లి శ్రీస్వామి అమ్మవార్లకు విశేష అభిషేకం నిర్వహిస్తారు. అనంతరం నైవేద్యం, మంత్రపుష్పం, హారతులు జరిపించి ప్రత్యేక అలంకరణ నిర్వహిస్తారు. అనంతరం శ్రీస్వామిఅమ్మవార్లను నాలుగు మాడ వీధుల్లో గ్రామోత్సవం నిర్వహించి తదుపరి శ్రీస్వామిఅమ్మవార్లను ప్రధాన ఆలయమునకు తీసుకొనివెళతారు. అన్ని కార్యక్రమాలను కరోనా నిబంధనలకు లోబడి మాత్రమే ఏర్పాటు చేస్తారు. అభిషేకాలం లో భక్తులను అనుమతిస్తారు. మూఢ కాలం అభిషేకాన్ని దేవస్థానం వారే నిర్వహిస్తారు.
previous post