తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో ఛైర్మన్ గా ప్రకటించి వారం రోజులు గడవక ముందే ఆ పార్టీలో మరో పదవి పొంగులేటిని వరించింది. తాజాగా ప్రకటించిన తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల కమిటీలో ఛైర్మన్ గా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని నియమించగా మరో 25మందిని సభ్యులుగా, ముగ్గురిని ప్రత్యేక ఆహ్వానితులుగా చేర్చింది.
కాగా ఇందులో పొంగులేటికి ఎన్నికల కమిటీ సభ్యుల జాబితాలో చోటు దక్కింది. ఈ నేపథ్యంలో ఉమ్మడిజిల్లా వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు పొంగులేటి శీనన్నకు డబుల్ ధమాకా అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.