ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచే సీఎం కేసీఆర్ పతనం మొదలవుతుందని, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని సాగనంపడానికి కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు సిద్ధంగా ఉన్నారని తెలంగాణ కాంగ్రెస్ కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. వైరాలోని వాసవీ కళ్యాణ మండపంలో డీసీసీ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గా ప్రసాద్ అధ్యక్షతన వైరా నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన బీఆర్ఎస్ సహా ఇతర పార్టీల నాయకులు అనేక మంది పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ కండువాలను కప్పి పొంగులేటి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి పొంగులేటి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు ఉన్నాయని బీఆర్ఎస్ నాయకులు అవాకులు, చవాకులు పేలుతున్నారని ఇదంతా పచ్చి అబద్ధం అన్నారు. కాంగ్రెస్ లో వర్గాలు లేవని తామంతా ఐక్యంగా పనిచేసి బీఆర్ఎస్ పార్టీని చిత్తుగా ఓడించేందుకు కంకంణం కట్టుకోని కుర్చున్నామన్నారు.
కోట్లు ఖర్చుపెట్టినా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తే సీఎం పీఠాన్ని అధిరోహిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, నియోజకవర్గ నాయకులు మాలోతు రాందాస్ నాయక్, బాణోత్ విజయ బాయి, వైరా మున్సిపల్ చైర్మన్ సూతగాని జైపాల్, శీలం వెంకట నర్సిరెడ్డి, లేళ్ల వెంకట రెడ్డి, గుమ్మా రోశయ్య, దాసరి డానియేల్, వడ్డే నారాయణ రావు, బొడ్డు కృష్ణయ్య, గోసు మధు, సీతారాములు, మిట్టపల్లి నాగి, పణితి సైదులు, ఇమ్మడి తిరుపతి రావు, కోసూరి శ్రీను, స్రవంతి, పరికపల్లి శ్రీను, తూము వెంకటేశ్వర్లు, ఇటికల మురళి తదితరులున్నారు.