Slider ఆదిలాబాద్

వరద బాధితుల్ని ఆపద్బాంధవుడిలా ఆదుకున్న జర్నలిస్టు

#Journalist

ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండల కేంద్రంలో ఒక ఘోర ప్రమాదం నుంచి ఆరుగురు రైతులు బయటపడ్డారు. జవహర్ నగర్, ముత్యం పెట్ కాలానికి చెందిన 6 రైతులు వ్యవసాయ పనుల నిమిత్తం బజార్ హత్నూర్ పక్కన ఉన్న పెద్ద వాగు దాటి ఈ రోజు ఉదయం  వెళ్లారు.

భారీ వర్షం రావడంతో సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చే హడావిడిలో ఎడ్ల బండిలో 4 ఆడవారు 2 మగవారు ఎక్కి వాగు దాటే ప్రయత్నం చేశారు. అయితే  నీటి ప్రహహం ఒక్కసారిగా రావడంతో ఎడ్ల బండి తో సహా 6 రైతులు కొట్టుకు పోయారు.

దాన్ని గమనించిన  కాలనీ వాసులు, ఆనంద్ రిపోర్టర్ అప్రమత్తమై వారికి సహాయం చేశారు. అక్కడే ఉన్నచెట్ల కొమ్మలను అందివ్వడంతో వారు ప్రమాదం నుంచి బయట పడ్డారు. పెను ప్రమాదం నుండి బయట పడ్డ రైతులకు సహాయం అందించిన ఆనంద్ ను, కాలనీ వాసులను బజార్ హత్నూర్ ప్రజలు అభినందించారు.

Related posts

రైట్ టైమ్ లో రిలీజవుతున్న ‘రాంగ్ స్వైప్’

Satyam NEWS

క్లాస్ మెట్స్ అంటే కేవలం చదువుకున్న వరకే కాదు….

Satyam NEWS

రెండవ రోజు ఒంటిమిట్ట కోదండరాముని వార్షిక బ్రహ్మోత్సవాలు

Satyam NEWS

Leave a Comment