క్లాస్ మెట్స్ అంటే కేవలం చదువుకునే వరకే కాదు.. కష్టాల్లో కూడా తోడు ఉంటామని నిరూపించారు ఈ విద్యార్ధులు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన గంగ జమున, ఆమె భర్త ఇద్దరూ స్వల్ప వ్యవధిలో అనారోగ్యంతో మరణించారు. వారికి ప్రనూష అనే కుమార్తె ఉన్నది. ఆమెకు పదవ తరగతి పూర్వ, సహా విద్యార్థులు అందరూ కలిసి వారి ఆర్థికంగా చేయూతనివ్వాలని నిర్ణయించారు.
తమ వంతుగా రూ. 30,000 ప్రనూష పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. అమ్మమ్మ , తాతయ్య ల సంరక్షణ లో ఉంటున్న ప్రనూష నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా ఉంటామని భరోసా కల్పించారు. ప్రనూష అమ్మమ్మ, తాతయ్యలకు ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన బాండ్ పేపర్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో రాజు, శ్రీను, సంజీవ్, సుమన్, క్రాంతి, నరేష్, శ్రీను,రమేష్, తోపాటు పలువురు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.