23.2 C
Hyderabad
May 7, 2024 20: 09 PM
Slider ప్రత్యేకం

ఓట్లు వేయించుకున్న వాళ్లు కోట్లు సంపాదిస్తున్నారు… మేం కోర్టుల చుట్టూ తిరుగుతున్నాం

#kollapurmla

ఓట్లు వేయించుకున్న వాళ్లు కోట్లు సంపాదిస్తున్నారని, తాము మాత్రం అప్పటి కేసులతో కోర్టుల చుట్టూ తిరుగుతున్నామని ఓ కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తున్నది….. ఈ దీన గాథ నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ కు సంబంధించిన ఒక కుటుంబానిది. కొల్లాపూర్ మండలం కుడికిళ్ళ గ్రామానికి చెందిన శివానందం అనే వ్యక్తి ఈ పచ్చి నిజాలను చెబుతున్నాడు.

వ్యవస్థ మార్పు కోసం కొట్లాడి  ఓట్లు వేయిస్తే కోర్టుల చుట్టూ తిరగాల్సిన దారుణ స్థితిలో తాను తన భార్య ఉన్నామని శివానందం ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తన లాగా మరెవ్వరికీ కాకూడదు, ఇంకొకరు బలికావద్దని కొల్లాపూర్ నియోజక వర్గం మిత్రులకు  వాట్సాప్ గ్రూప్ ద్వారా ఆవేదనతో శివానందం సూచిస్తున్నాడు. శుక్రవారం కోర్టుకు హాజరైన సందర్భంగా ఈ విషయాన్ని ఆయన తెలియజేశారు.

శివానందం కొల్లాపూర్ నియోజక వర్గంలో రాజకీయ మార్పుకోసం కొట్లాడాడు. ప్రజలను సమీకరించి అప్పటిలో అధికార పార్టీకి వ్యతిరేకంగా  ఓట్లు వేయించాడు. తన ఓట్లు వేయించిన వారు గెలిచారు…… కోట్లు సంపాదిస్తున్నారు…… అంటూ ఆయన తన ఆవేదన వెలిబుచ్చారు.

తాను తన భార్య అప్పటిలో నమోదు చేసిన కేసులలో భాగంగా కోర్టుల చుట్టూ తిరుతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కోట్లు సంపాదిస్తున్న వారు శివానందం దీన గాథను ఆలకిస్తారా? శివానందం దంపతులను ఆదుకుంటారా?…… తెలియదు…. శివానందం ఇంకా ఎన్నేళ్లు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందో కూడా….. తెలియదు.

Related posts

[Official] : Cbd Oil For Medical Use Floracy Cbd Oil

Bhavani

సీఎం జగన్ రెడ్డి తో తమ్ముడు అవినాష్ రెడ్డి భేటీ

Satyam NEWS

పంచాయితీ నిధుల స్వాహాపై విచారణ ప్రారంభం

Satyam NEWS

Leave a Comment