సమాజ అవసరాలకు అనుగుణంగా సేవ కార్యక్రమాలను చేయాలని మున్సిపల్ చైర్పర్సన్ గెల్లి అర్చన రవి, వైస్ చైర్మెన్ జక్కుల నాగేశ్వరరావు, సిఐ రాఘవరావులు అన్నారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని సాయిబాబా కళ్యాణ మండపంలో శుక్రవారం ప్రముఖ కాంగ్రెస్ పార్టీ నాయకుడు యడ్లపల్లి రామయ్య వర్ధంతి కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా వారి కుమారుడు ఎన్ ఆర్ ఐ యడ్లపల్లి శ్రీజన్ కుమార్ AA ఫౌండేషన్ ద్వారా హుజూర్ నగర్ మండలంలోని ఏడు ఉన్నత పాఠశాలలో పదో తరగతి అభ్యసిస్తున్న 16 మంది పేద మెరిట్ విద్యార్ధులకు లక్షా యాభై వేల రూపాయల విలువ గల సెల్ ఫోన్లను అందజేశారు.
తెలుగు అధ్యాపకులు సముద్రాల వేణువర్ధన్ అధ్యక్షతన జరిగిన ఈకార్యక్రమంలో పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ విద్యార్థులకు అవసరాలకు అనుగుణంగా స్మార్ట్ ఫోన్లను అందిచింన శ్రీజన్ కుమార్ అభినందనీయుడు అని కొనియాడారు.
భావితరాల భవిష్యత్తు కొరకు స్వచ్ఛంద సంస్థలు తోడ్పడటం చాలా గొప్ప విషయంగా అభివర్ణించారు.సేవలు పొందిన విద్యార్థులు స్మార్ట్ ఫోన్లను సద్వినియోగం చేసుకొని, ఉన్నత స్థాయికి చేరుకొని సమాజ సేవలు అందించినప్పుడే నిజమైన ప్రతిఫలం లభిస్తుందని అన్నారు.
కార్యక్రమంలో యడ్లపల్లి శ్రీజన్ కుమార్ కుటుంబ సభ్యులు, మండల విద్యాధికారి సైదానాయక్, స్ధానిక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సాముల శివారెడ్డి,మాజీ సర్పంచ్ గోట్టె వెంకటరామయ్య,ప్రముఖ నాయకులు బాచిమంచి గిరిబాబు, మాజీ జెడ్పిటిసి గల్లా వెంకటేశ్వర్లు, యం.డి.మజీద్, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.