27.7 C
Hyderabad
May 4, 2024 08: 20 AM
Slider ముఖ్యంశాలు

ఐఎన్​టీయూసీ అధ్యక్షుడిగా శ్రీనివాస్​

#intuc

ఇండియన్​ నేషనల్​ ట్రేడ్​  యూనియన్​ కాంగ్రెస్​ (ఐఎన్​టీయూసీ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా గుంజ శ్రీనివాస్​ నియమితులయ్యారు. ఆయనకు శుక్రవారం హైదరాబాద్​ లో నియామకపత్రం అందించారు. హైదరాబాద్​ లోని సోమాజీగూడ ప్రెస్​ క్లబ్​ లో ఐఎన్​టీయూసీ జాతీయ అధ్యక్షుడు అంబటి క్రిష్ణమూర్తి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

రంగారెడ్డి జిల్లా కుత్భుల్లాపూర్​ కు చెందిన గంజి శ్రీనివాస్​ కార్మికుల పక్షాన పని చేస్తున్నారు. ఆయన సేవలను గుర్తించిన జాతీయ కమిటీ.. తెలంగాణ రాష్ట్ర బాధ్యతలను అప్పగించింది. ఆయన ఏడాది పాటు ఈ పదవిలో కొనసాగనున్నట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా శ్రీనివాస్​ మాట్లాడుతూ కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామన్నారు. అనంతరం ఐఎన్​టీయూసీ జాతీయ అధ్యక్షుడు అంబటి కృష్ణమూర్తి మాట్లాడుతూ దేశంలోని అసంఘటిత, సంఘటిత కార్మికులను ఏకం చేస్తూ, యూనియన్​ సభ్యత్వాన్ని 2 కోట్లు చేసేందుకు ఇటీవల మధ్యప్రదేశ్​లో జరిగిన జాతీయ ప్లీనరీలో నిర్ణయించామన్నారు.

ప్రభుత్వరంగ సంస్థలను మోడీ ప్రభుత్వం విక్రయానికి పెడుతుందని, దీనిపై దేశ వ్యాప్తంగా పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గడ్డం వినోద్​, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీలు రాములు నాయక్​, రాధా కృష్ణయ్య, టీపీసీసీ సెక్రెటరీలు బండి సుధాకర్​, యాదగిరి, జీవేందర్​ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

అమానుషం: శరణార్థులు ఉన్న స్కూలుపై రష్యా బాంబుల దాడి

Satyam NEWS

ప్రజా మన్ననలు పొందిన ఉద్యోగి ధన్యుడు

Satyam NEWS

దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ కు ఒకే ధర ఉండాలి

Satyam NEWS

Leave a Comment