40.2 C
Hyderabad
May 5, 2024 17: 48 PM
Slider వరంగల్

ప్రమాదాలకు గురైన జర్నలిస్టు కుటుంబాలకు అండగా టిజేఏ

#journalists

తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులు ఎవరైతే టీజేఏ సభ్యత్వం  పొంది ఉండి అకస్మాత్తుగా  ప్రమాదవశాత్తు మరణించినట్లైతే వారి కుటుంబానికి తక్షణ సహాయం కింద 25 వేల రూపాయలను  టీజేఏ యూనియన్ అందజేస్తుందని రాష్ట్ర అధ్యక్షుడు నారగౌని పురుషోత్తం తెలిపారు. టీజేఏ విస్తరణ లో భాగంగా ములుగు జిల్లా కమిటీ ని ప్రకటించడం జరిగింది. ములుగు జిల్లా టీజేఏ అధ్యక్షుడు గా సంగ రంజిత్ కుమార్ , ఉపాధ్యక్షుడి గా అంకం వినయ్ కుమార్ ,ప్రధాన కార్యదర్శి గా చల్లగురుగుల రాజు ,కోశాధికారి గా ఆవుల వెంకన్న లను నియమించినట్లు రాష్ట్ర అధ్యక్షుడు నారగౌని పురుషోత్తం ప్రకటించారు.ప్రతి ఒక్కరు జర్నలిసస్ట్ ల సంక్షేమం కై పనిచేస్తూ జర్నలిస్టుల ఐక్యత ను చాటాలని ఆయన కోరారు . నూతనంగా బాధ్యతలు తీసుకున్న జిల్లా కమిటీ తమ నియామకానికి సహకరించిన రాష్ట్ర కమిటీ కి కృతజ్ఞతలు తెలుపుతూ తమ వంతు బాధ్యత గా ముందుకు వెళ్తూ రాష్ట్ర కమిటీ ఆదేశాలను సారం నడుచుకుంటూ జర్నలిస్టుల సమస్యల పట్ల పోరాటంలో ముందుంటామని తెలిపారు.

Related posts

నీలోఫర్ లో చికిత్స పొందుతూ కరోనాతో బాలుడు మృతి

Satyam NEWS

నెల్లూరు పట్టణంలో మజ్జిగ చలివేంద్రం ప్రారంభం

Satyam NEWS

సమగ్ర శిక్ష ఉద్యోగస్తులకు టైం స్కేల్ ఇవ్వాలి

Satyam NEWS

Leave a Comment