కాంగ్రెస్ పార్టీ మాజీ పార్లమెంటు సభ్యుడు,చలనచిత్ర దిగ్గజం ఘట్టమనేని శివరామకృష్ణ అకాల మరణంతో సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరా భవన్ లో మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో కృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి ఘనమైన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడుతూ చలనచిత్ర రంగంలో ఎంతోమంది పేదల కార్మికుల అభ్యున్నతి కొరకు ఎనలేని సేవ చేసిన మహనీయుడు ఘట్టమనేని శివరామకృష్ణ అని అన్నారు.చలనచిత్ర రంగంలో ఎన్నో సాహసోపేతమైన పాత్రలను పోషించారని, కాంగ్రెస్ పార్టీ నుండి ఏలూరు పార్లమెంటు సభ్యునిగా ఎనలేని సేవలు అందించారని, రాజీవ్ గాంధీ ప్రధాన ప్రియ శిష్యుడుగా రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులను అధిగమించి చలనచిత్ర రంగంలో ధృవ తారగా ఎదిగి సూపర్ స్టార్ అయ్యాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఐ ఎన్ టి యు సి నాయకుడు, దక్షిణ మధ్య రైల్వే జోనల్ సభ్యుడు యరగాని నాగన్న గౌడ్,మాజీ జెడ్పిటిసి గల్లా వెంకటేశ్వర్లు,గ్రంథాలయ మాజీ చైర్మెన్ ఇంటిమళ్ళ బెంజిమెన్, మాజీ కౌన్సిలర్ కంకణాల పుల్లయ్య, ఐ ఎన్ టి యు సి పట్టణ ప్రధాన కార్యదర్శి పోతనబోయిన రామ్మూర్తి,రెడపంగు రాము,యూత్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ప్రచార కార్యదర్శి కస్తాల రవీంద్ర,ఐ ఎన్ టి యు సి పట్టణ అధ్యక్షుడు పాశం రామరాజు,దొంతగాని జగన్,కందుకూరి రాము,మంద నాగరాజు,దాసరి రాములు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ హుజూర్ నగర్