ప్రైవేట్ విద్యుత్ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఉప్పల్ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ రావుల చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం రామంతపూర్ లో జరిగిన ప్రైవేట్ విద్యుత్ కార్మికుల నియోజకవర్గం ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ఉప్పల్ ఎలక్ట్రిషన్స్ పాల్గొని వారి వారి సమస్యల గురించి వివరణ తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బి ఆర్ ఎస్ పార్టీ ఉప్పల్ ఇన్చార్జి రావుల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ అన్ని విధాలా బి ఆర్ ఎస్ ప్రభుత్వం కార్మికుల కోసం అన్ని విధాల సహాయసహకారాలు, ప్రభుత్వం నుంచి అనేక సంక్షేమ పథకాలు కార్మికుల కోసం అందిస్తుంది, ఏ విషయంలో అధైర్య పడవద్దని కార్మికుల పార్టీ అంటే బి ఆర్ ఎస్ పార్టీ అని అన్నారు.
సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా