గాంధీని గాడ్సే చంపినట్లు గా అంబేద్కర్ జీవించి ఉంటే కాల్చి చంపే వాడిని అని హమారా ప్రసాద్ అనే వ్యక్తి సామాజిక మాధ్యామాల్లో పోస్ట్ చేసిన వీడియోపై బహుజన్ సమాజ్ పార్టీ వనపర్తి జిల్లా ప్రధాన కార్యదర్శి మిద్దె మహేష్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది అంబేద్కర్ అభిమానుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని ఆయన అన్నారు.
రేవల్లి మండల కేంద్రంలో నేడు ఆయన మీడియాత మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై ఇలా అనుచితమైన సంఘ వ్యతిరేకమైన వ్యాఖ్యలు చేయడం నేరమని అన్నారు.
సమాజంలో ఉద్రిక్తతలను రెచ్చగొట్టే ఈ సంఘ వ్యతిరేక శక్తి భవిష్యత్తులో హత్యలకు పాల్పడే విధంగా సంకేతాలు ఉన్నాయని ఆయన అన్నారు. కాబట్టి హమారా ప్రసాద్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రేవల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో రేవల్లి మండల ప్రధాన కార్యదర్శి వాడల రామకృష్ణ కోశాధికారి శేఖర్ బూత్ కమిటీ నాయకులు పూర్ణం కంటి హుస్సేన్ కల్మూరి వినోద్ పాల్గొన్నారు.