బాలీవుడ్ స్టార్ నటుడు ఆమీర్ ఖాన్ నటించిన యాడ్పై బీజేపీ ఎంపీ అనంత్కుమార్ హెగ్డే అభ్యంతరం వ్యక్తంచేశారు. హిందువుల్లో అశాంతిని కల్పించే బదులు.. అన్నింటిపై అవగాహన కల్పించాలంటూ సూచించారు. టైర్ల కంపెనీ సియెట్ రూపొందించిన యాడ్లో.. ఆమీర్ ఖాన్ రోడ్లపై టపాసులు కాల్చవద్దంటూ ప్రజలను కోరుతుంటారు.
అయితే.. ఈ యాడ్ హిందువుల్లో అశాంతిని సృష్టించేలా ఉందంటూ ద సియట్ లిమిటెడ్ ఎండీ, సీఈఓ అనంత్ వర్ధన్ గోయంకాకు 14న ఎంపీ హెగ్డే లేఖ రాశారు. మీ కంపెనీ ప్రకటనలో అమీర్ ఖాన్ వీధుల్లో పటాకులు కాల్చకండి అంటూ ప్రజలకు సలహా ఇస్తున్నారు. ప్రజా సమస్యలపై మీ స్పందనకు ధన్యవాదాలు. దీంతోపాటు రోడ్లపై ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా పరిష్కరించాలని కోరారు.