40.2 C
Hyderabad
April 28, 2024 15: 59 PM
Slider పశ్చిమగోదావరి

రైల్వేల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా సిఐటియు ధర్నా

#citu

నరేంద్ర మోడీ ప్రభుత్వం రైల్వేలను ప్రైవేటీరించడాన్ని వ్యతిరేకిస్తూ గురువారం సిఐటియు ఆధ్వర్యంలో ఏలూరు రైల్వే స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు. రైల్వే ప్రైవేటీకరణ ఆపాలని, ప్యాసింజర్ ట్రైన్స్ కొనసాగించాలని, రైల్వేలను పటిష్టం చేయాలని, ఉద్యోగుల సమస్యలు పరిశీలించాలని నినదించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేయడంలో భాగంగా రైల్వే రంగాన్ని ప్రైవేట్ పరం చేస్తుందని విమర్శించారు.

రైల్వే స్టేషన్లు, రైల్లు, రైల్వే మార్గాలు, మౌలిక సదుపాయాలకు సంబంధించి అన్ని విభాగాల లోకి కార్పొరేట్ సంస్థలకు ద్వారాలు తెరుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితంగా రైల్వే రంగం యావత్తు కార్పొరేట్ కంపెనీల చేతుల్లోకి పోతుందని విమర్శించారు. ఏడాదికి 2.5 లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తున్న పాడి గేదే లాంటి రైల్వే రంగాన్ని పెట్టుబడిదారులకు దోచి పెట్టేందుకు మోడీ ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. రైల్వేలో ఖాళీగా ఉన్న వేలాది పోస్టులు భర్తీ చేయకుండా ప్రమాదాలకు ప్రభుత్వమే కారణం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వేలో మౌలిక సౌకర్యాలు కల్పించాల్సింది పోయి సమస్యలను పెంచి పోషిస్తుందని విమర్శించారు.

భారత రైల్వే ఆదాయంలో 65 శాతం పైగా సరుకు రవాణా ద్వారానే వస్తుందని, సరుకు రవాణా కూడా ప్రైవేటు వాళ్ళకు అప్పచెప్పేందుకు మోడీ ఉత్సాహం చూపిస్తున్నారని విమర్శించారు. వృద్ధులు, వికలాంగులు, ఇతర వర్గాలకు ఇస్తున్న సబ్సిడీలు రద్దు చేయాలని కుట్ర చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రైల్వేలను రక్షించుకునేందుకు ఐక్యంగా పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ ధర్నాలో సిఐటియు నాయకులు బి సోమయ్య, సిహెచ్ సుందరయ్య, వి సాయిబాబు, టి పి ఆర్ దొర, కోటేశ్వరరావు, శాస్త్రులు తదితరులు నాయకత్వం వహించారు.

Related posts

డబ్బులు మీరు పంపి మాపై నెడితే ఏం చేయాలి?

Satyam NEWS

ఘనంగా వికారాబాద్ జిల్లా కలెక్టర్ పుట్టినరోజు

Bhavani

మే 16 నుండి దోస్త్

Bhavani

Leave a Comment