Slider నిజామాబాద్

అగ్నిపత్ ను విరమించుకోవాలి: మాజీ ఎమ్మెల్యే గంగారాం

#gangaram

పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో మాజీ శాసన సభ్యులు గంగారాం అధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష సోమవారం నిర్వహించారు. ఈ సందర్బంగా మాజీ శాసన సభ్యులు గంగారాం మాట్లాడుతూ  కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను వంచిస్తోందని ఆరోపించారు.

రైతులకు ఇచ్చిన హమీలను మరిచిందని, ఇప్పుడు అగ్నిపధ్ పేరిట నిరుద్యోగులను వంచిస్తుందన్నారు. జై కిసాన్ జై జవాన్ అంటూనే జవాన్లను, రైతులను ముంచిందన్నారు. అగ్నిపథ్ వస్తుందంటే అది అదానీ అంబానీల కనుసైగలో కొనసాగుతుందని ఆక్షేపించారు. అగ్నిపత్ ను వెంటనే విరమించుకోని యెడల తీవ్రస్థాయిలో ఉద్యమాలను ఉధృతం చేస్తామన్నారు.

కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేతో పాటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధర్పల్లి గంగాధర్ ,సీనియర్ నాయకులు విఠల్ రెడ్డి, నాగనాథ్,గోపాల్ రెడ్డి, వైస్ ఎంపీపీ సాయన్న ,శంకర్ పటేల్ తేజారావు పటేల్ రవి దేశాయ్,గోపన్పల్లి శంకర్ పటేల్, యువ నాయకులు విజయభాస్కర్రెడ్డి గంగాసాగర్, జాదవ్ సుజిత్కుమార్,మునీర్,కాళోజీ విఠల్రావు,వాజీద్నగర్ నాగభూషణ్,గుండా శ్రీనివాస్, ఆయా మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Related posts

హైదరాబాద్‌లో జక్‌ జ్యువెలరీ ఎక్స్‌పో ప్రారంభం

Satyam NEWS

బాలివుడ్ సూపర్ స్టార్ అమితాబ్ కు కరోనా

Satyam NEWS

సత్యం శివం సుందరం: ‘జగద్గురు’ ఆదిశంకరుడు

Satyam NEWS

Leave a Comment