డిసెంబర్ 5,6,7 తేదీలలో ఖమ్మం లో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలు జరుగనున్నాయని వాటిని జయప్రదం చేయాలని అని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు ఎర్ర శ్రీకాంత్ అన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ ఇంటింటికి కరపత్రాలు పంచుతూ ప్రచారం చేస్తూ మహాసభలకు రావాలని ప్రజలకి పిలుపునిచ్చారు. డిసెంబర్ 5 6 7 తారీఖులలో ఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రం లో మూడు రోజులపాటు ప్రతినిధుల సభ 1000 మందితో జరుగుతుందని, ఈ మహాసభలకు ముఖ్య అతిథిగా కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్, వ్యవసాయ కార్మిక సంఘం కేంద్ర నాయకులు రాష్ట్ర నాయకులు పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం ఖమ్మం జిల్లా నాయకులు ఎర్ర శ్రీనివాసరావు, తాత భాస్కరరావు, సిపిఎం సీనియర్ నాయకులు బండారు యాకయ్య, సంఘ నాయకులు భూక్య శ్రీనివాస్ , షేక్ ఇమామ్, పత్తిపాక నాగ సులోచన, శీలం వీరబాబు, సారంగి పాపారావు, వంకాయలపాటి వెంకటేశ్వరరావు, సూరయ్య , పున్నయ్య చౌదరి, అమరపల్లి బుచ్చయ్య, ఆంగోతు లక్ష్మణ్, ఎస్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
previous post
next post