ములుగు జిల్లా మంగపేట మండలం వాడాగూడేనికి చెందిన టెక్ మహేంద్ర ఉద్యోగి వాసం వివేక్ కుమార్ యూరోప్ లో అత్యధిక ఎత్తయిన మౌంట్ ఎల్బర్న్ పర్వతాన్ని అధిరోహించారు. రష్యా జార్జియా సరిహద్దుల్లో ఉండే ఈ పర్వతం సముద్ర మట్టానికి సుమారు 5 ,642 మీటర్లు (18 ,510 అడుగులు) ఎత్తులో ఉంటుంది. ఇది ప్రపంచంలోని 10 వ అత్యంత ప్రముఖ శిఖరంగా పేరుగాంచించింది. ఐరోపా, ఆసియ దేశాల్లోనే అత్యధిక ఎత్తులో ఉండే అగ్నిపర్వతం ఈ శిఖరంపై ఉంటుందని చెబుతున్నారు.
పంద్రాగస్టు రోజు (15-8-2023) వివేక్ ఈ పర్వతాన్ని అధిరోహించి భారత జాతీయ జెండా, తెలంగాణ మ్యాప్ ప్రదర్శించిన వాసం వివేక్ కుమార్ ఈ రోజు ములుగు కలెక్టర్ ఇలా త్రిపాఠి, RDO సత్యపాల్ రెడ్డి, Redcross Society రాష్ట్ర పాలకవర్గ సభ్యులు ఈ.వి.శ్రీనివాస్ రావు, K. ప్రసాద్ రావులను కలిశారు. వారు ఆయనను శాలువాతో సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమం లో Redcross Society జిల్లా సభ్యులు రాజి రెడ్డి, బండి ఈశ్వర్, శ్రమశక్తి అవార్డు గ్రహీత కుసుమ శ్యామసుందర్ తదితరులు పాల్గొన్నారు.