బాలీవుడ్ నటి అలియా భట్, నటుడు రణబీర్ కపూర్ తల్లిదండ్రులు అయ్యారు. ముంబైలోని హెచ్ఎన్ రిలయన్స్ హాస్పిటల్లో అలియా ఈరోజు ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ వార్తతో అభిమానులు చాలా సంతోషిస్తున్నారు. కపూర్ కుటుంబం నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో పాటు సినీ ప్రముఖులంతా కూడా అలియా-రణ్బీర్ కపూర్ తల్లిదండ్రులు కావడం పట్ల అభినందనలు తెలుపుతున్నారు. ఈ శుభవార్తను అలియా భట్ స్వయంగా సోషల్ మీడియా పోస్ట్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. దీనిపై అభిమానులతో పాటు బాలీవుడ్ స్టార్లు కూడా లిటిల్ ఏంజెల్ను ఆశీర్వదిస్తున్నారు.
అలియా భట్ డెలివరీ తర్వాత రణబీర్ ఒక పోస్ట్ను పంచుకున్నారు. అందులో మగ సింహం, ఆడ సింహం పిల్ల బొమ్మ పోస్టర్ ఉంది. ‘మన జీవితంలోని అత్యుత్తమ వార్త’ అని రాసి ఉంది. ఈ పోస్ట్ను షేర్ చేస్తూ, ఆలియా బ్లాక్ హార్ట్ ఎమోజీని పోస్ట్ చేసింది. మౌని రాయ్, శ్వేతా బచ్చన్, సోనమ్ కపూర్ నుండి స్టార్స్ అంతా అలియా పోస్ట్కి అభినందనలు తెలుపుతున్నారు.’బ్రహ్మాస్త్ర’ చిత్రంలో అలియా సహనటి మౌని రాయ్ ‘అభినందనలు రణబీర్-ఆలియా అంటూ స్పందించింది. శ్వేతా బచ్చన్, జోయా అక్తర్, నేహా ధూపియా, జాన్వీ కపూర్, అనన్య పాండే కూడా స్పందించారు. అక్షయ్ కుమార్ ఒక కామెంట్ రాశారు, ‘ఈ ప్రపంచంలో కుమార్తె కంటే గొప్ప ఆనందం మరొకటి లేదు అని ఆనందం వ్యక్తం చేశారు.