సమాజంలో వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టినా, సామాజిక మాధ్యమాల్లో వీడియోలు ప్రసారం చేసినా అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కడప డి.ఎస్.పి బి.వెంకట శివారెడ్డి హెచ్చరించారు. జిల్లా ఎస్పీ కె.కె.ఎన్ అన్బురాజన్ ఐ.పి.ఎస్ ఆదేశాల మేరకు శుక్రవారం సాయంత్రం డి.ఎస్.పి కార్యాలయంలో యూట్యూబర్లతో డి.ఎస్.పి సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ శాంతిభద్రతలకు భంగం వాటిల్లేలా ఎలాంటి చర్యలకు పాల్పడినా కేసులు నమోదు చేస్తామని డి.ఎస్.పి తెలిపారు. మతపరమైన సున్నిత అంశాల్లో అవాస్తవాలను ప్రచారం చేస్తే చర్యలు తప్పవన్నారు. సమాజంలో బాధ్యతాయుత వ్యక్తులుగా వ్యవహరించాలని సూచించారు. ఏదైనా సున్నితమైన విషయానికి సంబంధించి అనుమానాల నివృత్తికి పోలీసు అధికారులతో మాట్లాడాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన యుట్యూబ్ ఛానెళ్ల నిర్వాహకులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని డి.ఎస్.పి బి.వెంకట శివారెడ్డి పేర్కొన్నారు.
previous post
next post