28.7 C
Hyderabad
May 5, 2024 07: 49 AM
Slider ప్రత్యేకం

ఇంటర్ పరీక్షల కోసం పకడ్బందిగా ఏర్పాట్లు చేయాలి

#interexams

రాబోయే ఇంటర్మీడియట్ పదో తరగతి పరీక్షలను నిర్లక్ష్యానికి తావు లేకుండా పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. గురువారం పరీక్షల నిర్వహణపై ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్,  పాఠశాల విద్యాశాఖ కమిషనర్ దేవసేనతో కలిసి  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా వార్షిక పరీక్షలు నిర్వహించలేదని  ఈ  సంవత్సరం పరీక్షలు ప్రత్యేక  పరిస్థితులలో నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు.  మే నెలలో ఎండల తీవ్రత అధికంగా ఉండటం వల్ల విద్యార్థులకు  సమస్యలు రాకుండా  పరీక్ష కేంద్రానికి విద్యార్థులు సమయానికి చేరుకునే విధంగా ప్రత్యేక  ఆర్టీసీ బస్సులు నడపాలని సూచించారు. 

పరీక్ష అనంతరం విద్యార్థులు ఇంటికి క్షేమంగా చేరుకునే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లను సూచించారు. పరీక్షల నిర్వహణకు అన్ని జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా ఇంటర్మీడియట్ విద్యార్థులు  పరీక్షలు రాసే ముందు ఎవరైనా ఆందోళనకు గురైతే అలాంటి విద్యార్థులకు అక్కడే మాట్లాడి మానసిక ధైర్యం కల్పించే విధంగా చూడాలన్నారు. పరీక్షల నిర్వహణ సమయంలో  హైదరాబాద్ లో ముగ్గురు మానసిక వైద్య నిపుణులను ఏర్పాటు చేసి  టోల్ ఫ్రీ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.

ఆందోళన చెందే విద్యార్థులను టోల్ ఫ్రీ నెంబర్ 1800-5999333 నెంబరుకు  విద్యార్థులతో మాట్లాడించాలని ఈ నెంబరు ప్రతి పరీక్ష సెంటర్ ప్రిన్సిపాల్ వద్ద ఉండే విధంగా చూడాలన్నారు.  పరీక్ష నిర్వహణ అధికారులు నిర్లక్ష్యానికి తావు తెలుకుండా పోలీస్, రెవెన్యూ, వైద్య, పోస్టల్ శాఖ అధికారులు సమన్వయంతో పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు.

ఈ వీడియో కాన్ఫెరెన్స్ లో పాల్గొన్న నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ మాట్లాడుతూ మే, 6వ తేదీ నుండి నిర్వహించే ఇంటర్మీడియట్ పరీక్షలకు జిల్లా నుండి 14,409 మంది విద్యార్థులు హాజరుకానున్నారని, పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు 31 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 

23వ తేదీ నుండి నిర్వహించనున్న 10వ తరగతి పరీక్షలకు 11,082 మంది విద్యార్థులు వ్రాయనున్నారాని అందుకు 61 రెగ్యులర్ విద్యార్థులకు కాగా ఒక సెంటర్ సప్లిమెంటరీ విద్యార్థులకు వెరసి 62 సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.  పరీక్ష కేంద్రాల వద్ద ఒక ఏ.ఎన్. యం ఏర్పాటు చేసి ప్రాథమిక వైద్య కిట్లు, ఓ.ఆర్.ఎస్ ప్యాకెట్లు ఉంచేవిధంగా వైద్య అధికారికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.

పరీక్ష సమయంలో  నిరంతర విద్యుత్ సరఫరా, మంచినీటి సౌకర్యం, శానిటేషన్ కొరకు విద్యుత్, పంచాయతి రాజ్, మున్సిపల్ శాఖ అధికారులకు ఆదేశించినట్లు తెలియజేసారు.  విద్యార్థులు పరీక్షల సమయానికి వచ్చేవిధంగా ప్రత్యేక బస్సులు నడిపే విధంగా ఆర్.టి.సి అధికారులను నిర్దేశించినట్లు వెల్లడించారు.  ప్రశ్న పత్రాలు పోలీస్  స్టేషన్ నుండి పరీక్ష కేంద్రానికి సమయానికి చేరుకోవాలని, అనంతరం పోస్టల్ శాఖ ద్వారా పకడ్బందీగా పంపించే విధంగా చర్యలు తీసుకునేవిధంగా చర్యలు చేపట్టామన్నారు.  పరీక్ష కేంద్రంలో ప్రశ్న పత్రం తెరిచే రూములో సి.సి. కెమెరాలు పెట్టామన్నారు. 

ఈ సమావేశంలో పాల్గొన్న ఎస్పీ. కె. మనోహర్ మాట్లాడుతూ పరీక్షల నిర్వహణ సజావుగా నిర్వహించేవిధంగా పోలీస్ బందోబస్తు, ఫ్లయింగ్ స్క్వాడ్ కొరకు పోలీస్ ఎస్కార్ట్ ఏర్పాటు చేస్తామని తెలియజేసారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో  ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానీయ, ఇంటర్మీడియట్ బోర్డు సెక్రెటరి ఉమర్ జలీల్, పాఠశాల కమిషనర్ దేవసేన, డి.ఈ.ఓ గోవిందరాజులు, ఇంటర్మీడిట్ నోడల్ అధికారి వెంకటరమణ, డి.పి.ఓ కృష్ణ, మున్సిపల్ కమిషనర్లు,  తదితరులు పాల్గొన్నారు.

అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్

Related posts

ఫిల్మ్ సెన్సార్ బోర్డ్ సభ్యుడిగా సీనియర్ జర్నలిస్ట్ వడ్డి ఓంప్రకాశ్

Satyam NEWS

Case study: ముస్లింల మనసును కొల్లగొడుతున్న బిజెపి

Satyam NEWS

2 డోసుల టీకా లేకుంటే ప్రభుత్వ ఆఫీసుల్లోకి ప్రవేశం లేదు

Sub Editor

Leave a Comment