రాష్ట్ర ప్రభుత్వం అర్హులందరికి ఆసరా పెన్షన్ మంజూరు చేస్తుందని హైదరాబాద్ అంబర్ పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. శుక్రవారం గోల్నాకలోని ఏకే ప్లాజా ఫంక్షన్ హాల్ జరిగిన కార్యక్రమంలో పాల్గొని అంబర్ పేట నియోజకవర్గంలోని 220 మంది లబ్ధిదారులకు నూతన ఆసరా పెన్షన్ గుర్తింపు కార్డులను ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో, డిప్యూటీ ఎమ్మార్వో, ఇతర రెవెన్యూ అధికారులు, నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నదని ఆయన తెలిపారు. ఆసరా పెన్షన్లను వీలైనంత మంది అర్హులకు ఇచ్చేందుకే ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు.
సత్యం న్యూస్, అంబర్పేట