బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా
చిన్నతనంలోనే రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన అజయ్ మరణం బాధాకరమని సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ అన్నారు. ములుగు జిల్లా కేంద్రానికి చెందిన గొసుకుల అజయ్ అనే బాలుడు ఇటీవలే రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న తస్లీమా శుక్రవారం వెళ్ళి బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అజయ్ చిన్నతనంలోనే మరణించడం బాధాకరమని అన్నారు. ఇలాంటి సందర్భంలోనే ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులను తస్లీమా ఓదార్చారు. సర్వర్ చారిటబుల్ ట్రస్టు & ఫౌండేషన్ ఆధ్వర్యంలో 50 కేజీల బియ్యం అందించారు. తస్లీమా వెంట సర్వర్ చారిటబుల్ ట్రస్టు & ఫౌండేషన్ సభ్యులు,స్థానికులు ఉన్నారు.