ప్రజలకు అందుబాటులో మొబైల్ వ్యాక్సినేషన్ కేంద్రాలు తీసుకొచ్చామని, అపోహలు వీడి ప్రతిఒక్కరూ వాక్సిన్ తీసుకొనేందుకు ముందుకు రావాలని ఏఎస్రావునగర్ డివిజన్ కార్పోరేటర్ సింగిరెడ్డి శిరీషసోమశేఖర్రెడ్డి అన్నారు.
సోమవారం కాప్రా సర్కిల్ డాక్టర్ ఏఎస్రావునగర్ డివిజన్ భవానీనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో భవాని నగర్ కాలనీ అధ్యక్షులు, డివిజన్ కాంగ్రెస్పార్టీ అధ్యక్షులు కొత్త అంజిరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొబైల్ కరోనా వ్యాక్సినేషన్ క్యాంపును కార్పోరేటర్ ప్రారంభించారు.
అనంతరం వైద్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. . ఈ సందర్భంగా కార్పోరేటర్ శిరీషరెడ్డి మాట్లాడతూ ప్రస్తుతము ఉన్న వ్యాక్సినేషన్ కేంద్రాలకు తోడుగా మొబైల్వ్యాక్సినేషన్ కేంద్రాలను డివిజన్ పరిదిలో నిర్వహిస్తున్నామని ఈ క్యాంపులద్వారా ఎక్కువ మందికి టీకాలు ఇచ్చేందుకు అవకాశముందని ఆమె తెలిపారు.
కార్యక్రమంలో కమ్యూనిటి ఆర్గనైజర్ ఎ.శ్రీనివాసరెడ్డి, వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధానకార్యదర్శి చిరంజీవి, ఉపాధ్యక్షులు రుక్కయ్య, సంయుక్తకార్యదర్శి పెద్దిశ్రీనివాప్గుప్త, పుల్లారావు, కోశాదికారి ఓబుల్రెడ్డి, నాయకులు మొగలయ్య,శేఖర్, కాంగ్రెస్ ఎస్సి సెల్ గ్రేటర్కన్వీనర్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.