కాకతీయ నగర్ కాలనీలో నీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హబ్సిగూడ కార్పొరేటర్ కక్కిరేణి చేతన హరీష్ అన్నారు. సోమవారం హబ్సిగూడ డివిజన్ పరిధిలోని కాకతీయనగర్ లో జిహెచ్ఎంసి అధికారులతో కలిసి విస్తృతంగా పర్యటించారు. కాకతీయ నగర్ వెల్ఫేర్ అసోషియన్ సభ్యులు కాలనీలోని పలు సమస్యలు డ్రైనేజి సమస్య, పారిశుధ్య నిర్వహణ, విద్యుత్ సమస్యలు, నీటి సమస్యలు కార్పొరేటర్ దృష్టి కి తీసుక రాగా కార్పొరేటర్ సానుకూలంగా స్పందించి సంబ్నదిత అధికారులకు సమస్యలన్ని త్వరలోనే పరిష్కారాణికి కృషి చేయాలని అధికారులకు ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో అధికారులు ఈఈ నాగేందర్ , ఎఈ. కీర్తీ శ్రీ,డియి చందన, జలమండలి ఎఈ. ఆసిప్ ఆలీ, కాలనీ అధ్యక్షడు సుధాకర్,ప్రధాన కార్యదర్శి ఆపర్ణ, బిజెపి సీనియర్ నాయకులు , బోమ్మగోని రఘపతి గౌడ్,న్యాలకొండ సుమన్ రావు,, గ్యార రవీందర్,అల్కాపురి సురేష్, ముశిగంపల శివ గౌడ్, తదితరులు పాల్గొన్నారు. సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి