ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ పైడి తల్లి అమ్మవారిని ఉత్సవానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఏ.సూర్యకుమారి తెలిపారు.ఈమేరకు జిల్లా కలెక్టర్…ఈ ఉదయం పైడి తల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పైడి తల్లి అమ్మవారి ఉత్సవానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.
అమ్మవారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారన్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులు విధిగా మాస్క్ ధరించి పూర్తి స్థాయిలో కరోనా నిబంధనలు పాటిస్తూ సహకరించాలన్నారు. అలాగే పైడి తల్లి అమ్మవారి ఆశిసుల తో ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో ఉండాలని పేర్కొన్నారు.
తోలేళ్ల ఉత్సవాల సందర్బంగా విజయనగరం అంతా దేదీప్య మానంగా విద్యుత్ కాంతలులో విరాజిల్లుతోంది. నగరంలోముఖ్య ప్రదేశాలైన కోట,చదుర గుడి,వనంగుడి, అమ్మవారి దేవస్థానం కార్యాలయం, మయూరీ జంక్షన్, ఆర్టీసీ కాంప్లెక్స్ ,గంటస్థంభం, ఇలా నగరంలోని ముఖ్యమైన ప్రదేశాలన్నీ విద్యుద్దీపాలంకరణతో అలరారుతున్నాయి.
ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం విజయనగరంలోని శ్రీశ్రీశ్రీ అమ్మవారి సిరిమాను ఉత్సవాలకు జిల్లా కేంద్రం సిద్ధమయ్యింది.