చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ముస్లింల సంక్షేమానికి ఎన్నో పథకాలు అమలు చేశారని ఏపీ శాసనమండలి మాజీ చైర్మన్ ఏం. ఏ షరీఫ్ అన్నారు. అయితే ఈ సంక్షేమ పథకాలన్నింటిని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక అన్నింటినీ రద్దు చేశారు. కక్షపూరితంగా పథకాలను నిలుపుదల చేశారు. మైనార్టీ నిధులను మళ్లించేస్తున్న వైసీపీకి మైనారిటీలంతా గుణపాఠం చెప్పాలి అని ఆయన అన్నారు. 40 ఏళ్లుగా టీడీపీ చరిత్ర చూడండి.
కుల, మత, ప్రాంత విబేధాలు లేకుండా అందరూ జీవించేలా పాలన అందించిన ఘనత తెలుగుదేశానిదే. ముస్లిం ఓట్లతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ ఏనాడు వారికి అభివృద్ది చేసిందేలేదు. 1985 లో మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టి ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారు అని ఆయన తెలిపారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన ఘన నివాళి అర్పించారు.