30.7 C
Hyderabad
May 5, 2024 04: 35 AM
Slider ఖమ్మం

అవసరం మేరకు కేటాయింపులు

#collector

సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయం లో కార్యాలయాల అవసరం మేరకు కేటాయింపులు చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. జిల్లా అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్యాలయం సిబ్బంది, గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారుల సంఖ్య, సెక్షన్ల మేరకు గదుల కేటాయింపు చేపడతామన్నారు. జిల్లా అధికారులు ఇప్పటికే వారి సిబ్బంది వివరాలు, ప్రస్తుతముంటున్న భవన వివరాలు తదితరాలు సమర్పించినట్లు ఆయన తెలిపారు. గ్రౌండ్ ఫ్లోర్ నకు మాత్రమే ఫర్నిచర్ ఉన్నందున, మొదటి, రెండో అంతస్తులో కేటాయించే కార్యాలయాలు ఫర్నిచర్ విషయమై ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. కార్యాలయాల తరలింపుకు అన్ని విధాల సంసిద్దంగా ఉండాలని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు స్నేహాలత మొగిలి, ఎన్. మధుసూదన్, జిల్లా రెవిన్యూ అధికారిణి శిరీష, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

స్టార్‌ మా డ్యాన్స్‌ + విజేతగా నిలిచిన సంకేత్‌ సహదేవ్‌

Satyam NEWS

మహనీయులు నడియాడిన నగరంలో శ్లీ ప్లవ నామ వేడుకలు

Satyam NEWS

భారీగా పెరిగిన సుందర్‌ పిచాయ్‌ జీతం

Satyam NEWS

Leave a Comment