రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీనే అని బీజేపీ నేత మర్రి శశిధర్రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో పరిణామాలు బాధ కలిగిస్తున్నాయని మర్రి శశిధర్రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి తమ కుటుంబం సంబంధాలు ఉన్నాయని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని మొదటి పోరాటం చేసిన వ్యక్తి మర్రి చెన్నారెడ్డి అని చెప్పారు. తెలంగాణ ఫస్ట్ అనే నినాదం, తెలంగాణ ప్రజలకు మేము ఉన్నాం అని చెప్పేది కేవలం బీజేపీ మాత్రమే అని మర్రి శశిథర్ రెడ్డి తెలియజేశారు. టీఆర్ఎస్ అంటే ఫ్యామిలీ ఫస్ట్, ఫామ్ హౌస్ ఫస్ట్, కూతురు ఫస్ట్ అనేది తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ పైన రోజు రోజుకు విశ్వాసం తగ్గుతుంటే, బీజేపీకి పెరుగుతుందని మర్రి శశిథర్ రెడ్డి స్పష్టం చేశారు.
next post