గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1988_89 బ్యాచ్ కు చెందిన 10వ తరగతి పూర్వ విద్యార్థులు పూర్వ స్నేహితుని భార్యకు ఆర్థిక సహాయం అందించారు.పాలవాయి గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు భార్య పద్మమ్మకు గుండె నొప్పి రావడంతో హైదరాబాదులో ప్రైవేట్ ఆస్పత్రిలో గుండెకు కు స్టంట్ వేయడంతో వెంకటేశ్వర్లు కుటుంబం ఆర్థిక ఇబ్బందులకు గురయ్యాడు.
సమాచారం తెలుసుకున్న పూర్వ విద్యార్థులు అందరూ కలిసి రూ.40వేలు ప్రోగు చేసి వెంకటేశ్వర్లు కు గురువారం అందజేశారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పురందర కుమార్, రాముడు, నరసింహారెడ్డి, లక్ష్మీనారాయణ, మురళీధర్ గౌడ్, ప్రేమ రాజు, ఆనందరాజు, రమేష్, మునిస్వామి, ఖాజావలి, వెంకట్రాంరెడ్డి డీలర్, దామ బీమా రాయుడు, అశోక్ శెట్టి, యూ ఓబులేసు, కానిస్టేబుల్ నరసింహులు, అమరవాయి రవీందర్ రెడ్డి, పిచ్చయ్య శెట్టి, సుధాకర్, వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు