34.7 C
Hyderabad
May 4, 2024 23: 16 PM
Slider హైదరాబాద్

భారీ వర్ష బాధితులను పరామర్శించిన అంబర్ పేట్ నేతలు

#heavyrains

భారీ వర్షంతో ప్రజలు కష్టాలు పడుతున్న ప్రాంతాలలో హైదరాబాద్ లోని అంబర్ పేట్ డివిజన్ కార్పొరేటర్ ఈ.విజయ్ కుమార్ గౌడ్ నేడు పర్యటించారు. అంబర్ పేట్ డివిజన్ లో నిన్న కురిసిన అకాల వర్షానికి పటేల్ నగర్ లో ఇల్లు కూలిపోయింది. దాంతో అంబర్ పెట్ కార్పొరేటర్ వెళ్లి బాధితులను  పరామర్శించి జరిగిన నష్టాన్ని సంబంధిత అధికారులకు తెలియజేశారు.

అలాగే చిలుకమ్మ గల్లీలో డ్రైనేజ్ పొంగడం తో  స్థానికులతో కలిసి పరిశీలించారు. వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి పాడైపోయిన మ్యాన్ హోల్ నీ తొందరగా నిర్మించాలని తెలియజేశారు. బాపూ నగర్ లో షార్ట్ సర్క్యూట్ తో వంటగది కాలిపోవడంతో అక్కడికి వెళ్లి పరిశీలించి సంబంధిత అధికారులకు తెలియజేసి వెంటనే నష్ట నివారణ చర్యలు చేపట్టాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక బస్తీ ప్రజలతో పాటు టిఆర్ఎస్ సీనియర్ నాయకులు మల్లేష్ యాదవ్, మహేష్ ముదిరాజ్, నాగరాజు, రంగు ఉదయ్ గౌడ్, సంతోష్ చారి, దినేష్, తదితరులు పాల్గొన్నారు.

Related posts

కోడి పందాలు: ఆంధ్రాలో తెలంగాణ నాయకుల సందడి

Satyam NEWS

అవగాహన లేని జగన్: అమాంతం పెరిగిన కరెంటు చార్జీలు

Satyam NEWS

లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలవకుండా చేయాలి

Satyam NEWS

Leave a Comment