స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ గా అమిత్ జింగ్రాన్ బాధ్యతలు చేపట్టారు.
అమిత్ 1991లో లక్నో సర్కిల్ లో ప్రొబేషనరీ ఆఫీసర్ గా ఆయన ఎస్ బి ఐలో చేరారు. రిటైల్ క్రెడిట్, డిపాజిట్ మొబిలైజేషన్, అంతర్జాతీయ బ్యాంకింగ్ లో అమిత్ అసాధారణ ప్రతిభ కనబరిచారు.
చికాగోలోని ఎస్ బి ఐ లో సీఈవో గా కూడా ఆయన పని చేశారు.
మూడు దశాబ్దాల అనుభవం తర్వాత ఆయన చీఫ్ జనరల్ మేనేజర్ గా నియమితులయ్యారు.
ఇప్పటి వరకూ ఆ స్థానంలో ఉన్న ఓ పి మిశ్రా డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గా పదోన్నతి పొందారు. ఆయనను ముంబయికి బదిలీ చేశారు.