జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రంలోని స్వయంభూ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో వెలిసిన శ్రీ శేష దాసుల 136వ ఆరాధన మహోత్సవాలు ఏప్రిల్ 30 ,మే 1, 2 తేదీలలో జరగనున్నాయి. ప్రతి ఏటా వేలాది మంది భక్తులతో అంగరంగ వైభవంగా నిర్వహించే స్వామివారి ఉత్సవాలు ఈ సంవత్సరం కరోనా లాక్ డౌన్ కారణంగా పరిమిత సంఖ్య భక్తులతో జరగనున్నాయి.
సామాజిక దూరం పాటిస్తూ శేష దాసుల కుటుంబీకులు మాత్రమే ఇందులో పాల్గొంటారు. మూడు రోజులపాటు భక్తులు వారి వారి ఇళ్లల్లో ఉగా భోగములు, సుళాది, అష్టక పారాయణములు చేసి స్వామి వారి కరుణా కటాక్షాలను పొందాలని శ్రీ శేష దాసు సేవాసమితి మొదలకల్లు (మల్దకల్) అధ్యక్షులు ధరూరు శేషగిరిరావు, సభ్యులు ధీరేంద్ర దాస్, రాఘవేంద్ర దాస్, మోహన్ రావులు ఒక ప్రకటనలో తెలిపారు. స్వామివారి ప్రసాదం, మంత్రాక్షతలు లాక్ డౌన్ ముగిశాక వారి వారి అడ్రస్ లకు పంపిస్తామని తెలిపారు.