కాంగ్రెస్ బహిష్కృత నాయకుడు కౌశిక్రెడ్డి ఈ నెల 16న టీఆర్ఎస్లో చేరనున్నారు.
ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సమక్షంలో తెలంగాణ భవన్లో తన అనుచరులతో కలసి టీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు.
ఈ నెల 14న హుజూరాబా ద్కు చెందిన కాంగ్రెస్ నేతలు పెద్ద సంఖ్యలో రాజీనామా చేస్తారని కౌశిక్రెడ్డి ప్రకటించారు.
నియోజకవర్గంలో వివిధ స్థాయిలకు చెందిన సుమారు 2 వేల మంది కార్యకర్తలు తన వెంట టీఆర్ఎస్లో చేరుతారని కౌశిక్రెడ్డి సంకేతాలు ఇచ్చారు.
త్వరలో జరిగే ఉప ఎన్నికలో టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తారని కొంత కాలం నుంచి ప్రచారం జరుగుతోంది. ఈటల రాజేందర్ను ఓడించడమే లక్ష్యంగా టీఆర్ఎస్లో చేరుతున్నట్లు కౌశిక్రెడ్డి ప్రకటించారు.