తాగొచ్చినవాడు ఇంట్లో పెళ్లాన్ని కొడతాడని తెలుసు. చాలా సార్లు విని ఉంటాం లేదా చూసి ఉంటాం. వీడెవడో తాగొచ్చి ఆవుల్ని కొట్టాడు.
తల్లి లాంటి ఆవు పట్ల దారుణంగా ప్రవర్తించాడు. మరీ లేగ దూడ పట్ల ఈ దుర్మార్గుడు చూపిన క్రౌర్యం ఒళ్లు గగుర్పొడుస్తున్నది.
హైదరాబాద్ లోని సైదాబాద్ లో ఉన్న భూలక్ష్మి ఆలయ గోశాలలో ఈ దారుణం జరిగింది. మద్యం మత్తులో ఉన్నఅక్కడి పని వాడు గోవుల పై దాడి చేశాడు.
ఆలస్యంగా ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. అదీ కూడా జరిగిన తతంగం మొత్తం సిసి టీవీలో రికార్డు కావడంతో తెలిసింది.
విషయం తెలిసిన పోలీసులు నిందితుల పై sec 11(A) ప్రేవెంక్షన్ ఆఫ్ క్రూయల్టీ అనిమల్ ఆక్ట్ 1960 కింద కేసు నమోదు చేశారు.