అన్నం పరబ్రహ్మ స్వరూపం అని బిఆర్ఎస్ సీనియర్ నాయకులు బిఎల్ఆర్ ట్రస్టు చైర్మన్ బండారి లక్ష్మారెడ్డి అన్నారు. ఉప్పల్ నియోజకవర్గం కాప్రా డివిజన్లోని కందిగూడ లో గల సాయిబాబా మందిర్లో సికిందర్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమమును ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బి ఎల్ ఆర్ ట్రస్ట్ చైర్మన్, బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు బండారి లక్ష్మారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నం పరబ్రహ్మ స్వరూపమని, అన్ని దానాల కంటే అన్నదానం చాలా గొప్పదని, మనం ఎంత సంపాదించిన చివరికి తినేది అన్నమేనని, అందరూ తమ సంపాదనలో కొంత భాగాన్ని అన్నదానం కోసం వెచ్చించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ యువ నాయకులు బైరి నవీన్ గౌడ్, ఇంద్రయ్య, మహేష్ గౌడ్, విజయ్, మనోజ్ కుమార్, అరుణ్ కుమార్, గౌతమ్, నిఖిల్, నీరజ్ కుమార్, మహేష్, దశరథ్, కళ్యాణ్, అప్పు, లడ్డు, దండు, నితీష్ మరియు అంబిక వాణి, తేజస్విని, ఉదయ రాణి, సరోజ, ఆషారాణి, స్వరూప, కళ్యాణి, ఐశ్వర్యారాయ్, అమల, భూమేశ్వరి, నాగేశ్వరి, చంద్రకళ మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా