తెలంగాణ లో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటీవ్ వచ్చింది. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు కరోనా బారిన పడ్డారు. తాజాగా ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆమె యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఆమె భర్త గొంగిడి మహేందర్ రెడ్డి టెస్టుల ఫలితాలు రావాల్సి ఉంది. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె తెలిపారు. స్వల్ప అస్వస్థతతో ఇబ్బంది పడుతున్న సునీత యశోద ఆస్పత్రిలో చేరారు. వైద్యులు ఆమెకు కరోనా టెస్టులు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆమె అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, ఆలేరు నియోజకవర్గం పరిధిలోని ప్రజలు, పార్టీ నాయకులు, అభిమానులు ఎవరూ ఆందోళన చెందవద్దని కోరారు.
110 స్థానాల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయం